ఎల్బీనగర్ స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం

 ఎల్బీనగర్ స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం

హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న వీర భోగా వసంత రాయులు ఆదివారం (నవంబర్ 19న) వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శాలివాహన రాజు వేషధారణలో గుర్రంపై ఎక్కి.. ఎల్బీనగర్ లోని శ్రీకాంత్ చారి విగ్రహం వద్ద ప్రచారం ప్రారంభించారు. అక్కడి నుంచి దిల్ షుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ వరకు ప్రచారం చేశారు. ఎల్బీనగర్ ప్రజలు చైతన్యవంతమైనవారని, ఈ సారి తనలాంటి ఉన్నత విద్యావంతునికి, బీసీ అభ్యర్థికి  ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో బహుజనులకు అవకాశం ఇవ్వాలని  ఓటర్లకు  విజ్ఞప్తి చేశారు.