టెన్త్‌‌ స్టూడెంట్ల మృతిపై విచారణ జరపాలి

టెన్త్‌‌ స్టూడెంట్ల మృతిపై విచారణ జరపాలి

యాదాద్రి, వెలుగు : టెన్త్‌‌ స్టూడెంట్స్​ మృతిపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని వివిధ పార్టీల నేతలు డిమాండ్​ చేశారు. ఆదివారం స్టూడెంట్స్​ ఫ్యామిలీలతో కలిసి భువనగిరిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్​, ఎస్సీ వెల్ఫేర్​ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగానే స్టూడెంట్స్​ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. వారికి ఎక్స్​గ్రేషియా అందించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

విషయం తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి, అడిషనల్​ కలెక్టర్​ భాస్కర్​రావు, ఇతర ఆఫీసర్లు​ అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరిపి.. ప్రభుత్వం తరఫున న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇద్దరు స్టూడెంట్స్​కుటుంబ సభ్యులకు  రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అంత్యక్రియలు పూర్తయ్యేంతవరకూ ఆఫీసర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు.