కేసీఆర్​తో మండలి చైర్మన్ ​గుత్తా భేటీ

కేసీఆర్​తో మండలి చైర్మన్ ​గుత్తా భేటీ

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్​ను శాసన మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్​కు తన కుమారుడు అమిత్​తో కలిసి వెళ్లిన గుత్తా.. కేసీఆర్​తో భేటీ అయ్యారు.

అలాగే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఆలంపూర్​ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్​రావు కూడా కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, అంతకుముందు హైదరాబాద్​లో బీఆర్ఎస్​వర్కింగ్ ​ప్రెసిడెంట్​కేటీఆర్​ను ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి,ఎమ్మెల్యే విజయుడు కలిశారు.