
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ టెక్కంపెనీ లెనోవో, హైదరాబాద్లో గురువారం తమ పూర్తిస్థాయి ఎంటర్ప్రైజ్ ఏఐ పోర్ట్ఫోలియోను ప్రదర్శించింది. అందరికీ స్మార్టర్ ఏఐని అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను ఆధునీకరించడానికి, టెక్నాలజీలను సమర్థంగా ఉపయోగించుకోవడానికి ఈ సొల్యూషన్లు ఉపయోగపడతాయని లెనోవో తెలిపింది.
కంపెనీ ఎంటర్ప్రైజ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిత్ మిదా మాట్లాడుతూ, తమ ఏఐ పోర్ట్ఫోలియోలో సర్వర్లు, స్టోరేజీ, ఎడ్జ్, హెచ్పీసీ ఉన్నాయని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, మైక్రోసాఫ్ట్తో కలిసి థింక్ షీల్డ్ ఎక్స్డీఆర్ వంటి సెక్యూరిటీ సేవలనూ అందిస్తున్నామని పేర్కొన్నారు.