సియోని (మధ్యప్రదేశ్): పశువులను మేపడానికి అడవికి వెళ్లిన తండ్రీకూతుళ్లపై చిరుత పులి దాడి చేసింది. ఈ ఘటనలో కూతురు చనిపోగా, తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లా పాండివాడ గ్రామానికి దగ్గర్లో ఉన్న కన్హివాడ అటవీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. ఈ మేరకు ఆదివారం ఫారెస్ట్ రెంజర్ యోగేశ్ పటేల్ వివరాలు వెల్లడించారు. పశువులను మేపడానికి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురు రవీనా యాదవ్ (16)తో కలిసి అడవికి వెళ్లాడు. మెయిన్ రోడ్డు నుంచి దాదాపు 3 కిలోమీటర్ల వరకు అడవి లోపలికి వెళ్లారు. పశువులను మేపుతున్న సమయంలో ఒక్కసారిగా చిరుతపులి బాలికపై దాడి చేసింది. బాలిక మెడ పట్టుకొని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఇది గమనించిన తండ్రి కూతురిని కాపాడుకునేందుకు కర్ర తీసుకొని చిరుతపై దాడికి దిగాడు. దీంతో అతడిపై కూడా చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వీరి అరుపులకు చుట్టుపక్కల వారు ఘటన స్థలానికి రాగా, బాలికను వదిలేసి అక్కడి నుంచి చిరుత అడవిలోకి పారిపోయింది. చిరుత దాడిలో ఆ బాలిక అప్పటికే మరణించింది. బాధిత కుటుంబానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేసింది. త్వరలో రూ.4 లక్షలు సాయం అందజేస్తామని అధికారులు చెప్పారు. చిరుతను పట్టుకునేందుకు అడవిలో బోనులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 15న సియోని జిల్లాలోని కియోలారి బ్లాక్లోని మోహ్గావ్ గ్రామానికి చెందిన 50 ఏండ్ల మహిళపై చిరుతపులి దాడి చేసి చంపేసింది.
తండ్రి కూతుళ్లపై చిరుత దాడి
- తెలంగాణం
- October 18, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Bellamkonda Sreenivas: బిగ్గెస్ట్ బడ్జెట్తో వస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్ వరుస లైనప్ మూవీస్ చూస్తే షాకే!
- Health Alert: తెల్లగా కనిపించేదంతా పన్నీర్ కాదు.. ఫేక్ పన్నీర్ గుర్తించటం ఎలా..
- GT vs RCB: సాయి సుదర్శన్ ఒంటరి పోరాటం.. బెంగళూరు ముందు భారీ లక్ష్యం
- కల్వకుంట్ల పేరు తీసేసి అబద్దాల ప్రొపెసర్ అని పెట్టుకో కేసీఆర్ : జగ్గారెడ్డి
- సింగరేణిలో 327 జాబ్స్ ధరఖాస్తు తేదీల్లో మార్పులు
- మనిషి దాహం తీర్చిన ఏనుగు.. వీడియో వైరల్
- Weather update: నిప్పుల కొలిమి ..... తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
- రూ. 600 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది అరెస్ట్
- Rathnam Movie Collections: విశాల్కే షాకిచ్చిన రత్నం కలెక్షన్స్.. మరీ ఇంత దారుణమా!
- HCLTech నికర లాభం రూ. 3,995 కోట్లు
Most Read News
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- గోడ దూకే నాయకుల్లారా ఖబడ్దార్.. మిర్యాలగూడలో ఫ్లెక్సీల కలకలం