కృష్ణాను ముంచిన్రు..గోదావరి మీద పడ్డరు..ఏపీ జల దోపిడీని కలిసికట్టుగా అడ్డుకుందాం.

కృష్ణాను ముంచిన్రు..గోదావరి మీద పడ్డరు..ఏపీ జల దోపిడీని కలిసికట్టుగా అడ్డుకుందాం.
  • బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ పిలుపు

ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ జల దోపిడీకి పాల్పడుతున్నదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆరోపించారు. దీనిని కలిసికట్టుగా అడ్డుకుందామని పిలుపునిచ్చారు. ‘కృష్ణాను ముంచిర్రు.. గోదావరి మీద పడ్డారు’  అనే అంశంపై తెలంగాణ జల్ బచావో నినాదంతో ఈ నెల 9న సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగే అఖిలపక్ష సమావేశానికి రావాలని మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డిని కోరారు. 

శుక్రవారం ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. నీటి దోపిడీని శాశ్వతంగా అడ్డుకునే కార్యాచరణతో ముందుకు వెళ్దామని అన్నారు.  9న జరిగే అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల అధ్యక్షులు, ముఖ్య నాయకులు,  నీటిరంగ నిపుణులు, పర్యావరణవేత్తలు పాల్గొంటున్నారని తెలిపారు.