కార్గిల్ హీరోలకు సలాం చేద్దాం

కార్గిల్ హీరోలకు సలాం చేద్దాం

ఒలింపిక్స్ క్రీడాకారులకు మద్దుతుగా ప్రారంభమైన విక్టరీ పంచ్ క్యాంపెయిన్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఆటగాళ్లందరూ చాలా కష్టపడి టోక్యోకు చేరుకున్నారని, ప్రజలు తెలిసో తెలియకో వారిపై ఎలాంటి ఒత్తిళ్లు చేయకూడదని కోరారు. కార్గిల్ యుద్ధం భారత సైన్యం యొక్క ధైర్య సాహసాలకు, క్రమశిక్షణకు చిహ్నమని చెప్పారు. మన శక్తి సామర్థ్యాలను ప్రపంచం మొత్తం చూసిందని తెలిపారు. కార్గిల్ వీర గాథను ప్రతి ఒక్కరూ చదవాలని మన్ కీ బాత్ లో కోరారు. కార్గిల్ హీరోలకు సలాం చేద్దామన్నారు మోడీ.