- పీసీసీ చీఫ్గా రేవంత్ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది
- ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం సంతోషం
- సభకు నియోజకవర్గం నుంచి 10 వేల మందిని తరలిస్తున్నామని వెల్లడి
మందమర్రి, వెలుగు: ఇంద్రవెల్లిలో శుక్రవారం జరగనున్న తెలంగాణ పునర్నిర్మాణ సభను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి ఇంద్రవెల్లి సభకు 10 వేల మందిని తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి వివేక్ మాట్లాడారు. ‘‘పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్రెడ్డి ప్రస్థానం ఇంద్రవెల్లి నుంచే ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా నుంచి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది. కాంగ్రెస్ సర్కార్ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్నాం. మిగిలిన గ్యారంటీల అమలుకు సర్కార్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది” అని తెలిపారు.
కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు?
మాజీ సీఎం కేసీఆర్తన తుగ్లక్నిర్ణయాలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేశారని వివేక్ మండిపడ్డారు. ‘‘మరో రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును కాదని.. కేసీఆర్ రీడిజైనింగ్పేరుతో కాళేశ్వరం కట్టిండు. రూ.లక్ష కోట్లు దుర్వినియోగం చేశాడు. అలాంటి కేసీఆర్ను ఈడీ, సీబీఐ ఎందుకు అరెస్టు చేయడం లేదు” అని ప్రశ్నించారు. వెంటనే కేసీఆర్ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘‘మిషన్భగీరథలోనూ పాత పైపులు వేసి రూ.40 వేల కోట్లు దోచుకున్నారు.
కేసీఆర్ఫ్యామిలీ, ఆయన బంధుగణం హైదరాబాద్ చుట్టుపక్కల 20 వేల ఎకరాల భూములను ధరణి పోర్టల్ద్వారా కాజేసింది. జీహెచ్ఎంసీలోనూ చేయని పనులకు బిల్లులను విత్డ్రా చేసిన కుంభకోణం కూడా ఇటీవల బయటపడింది. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన కేసీఆర్.. తెలంగాణను రూ.6.70 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు” అని ఫైర్ అయ్యారు. ‘‘తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి బీఆర్ఎస్అవినీతి, అక్రమాలను బయటపెట్టిందనే అక్కసుతో వీ6 చానెల్, వెలుగు పత్రికపై కుట్రలు చేశారు. కానీ వారి చర్యల వల్ల వీ6, వెలుగుకు మరింత జనాదరణ పెరిగింది” అని అన్నారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్న కేటీఆర్.. కాంగ్రెస్ సర్కార్వచ్చి 60 రోజులు కాకముందే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.