మార్చిలోపు ఎల్‌​ఐసీ ఐపీఓ

మార్చిలోపు ఎల్‌​ఐసీ ఐపీఓ

న్యూఢిల్లీ: ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ నాలుగో క్వార్టర్లోనే ఎల్​ఐసీ ఐపీఓ ఉంటుందని డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్​ పబ్లిక్​ ఎసెట్​ మేనేజ్​మెంట్​ (దీపమ్) సెక్రటరీ తుహిన్​ కాంత పాండే వెల్లడించారు. ఎల్​ఐసీలో 10 % వాటా అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ వాటా అమ్మకం ద్వారా రూ. 10 లక్షల కోట్లు సేకరించాలని టార్గెట్​గా పెట్టుకున్నారు. ఎల్​ఐసీలో 5% వాటా అమ్మితే అది దేశంలోనే అతి పెద్ద ఐపీఓ అవుతుంది. ఇంకో 5 % అంటే మొత్తం 10%  అమ్మితే ఎల్​ఐసీ ప్రపంచంలోనే రెండో పెద్ద ఇన్సూరెన్స్​ కంపెనీ అవుతుందని బ్లూమ్​బర్గ్​ పేర్కొంది. ఎల్‌ఐసీ పబ్లిక్​ ఇష్యూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేదే తమ ఆలోచనని, కాకపోతే  ప్రాసెస్​కి టైము పడుతోందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ చెప్పారు. ఎల్​ఐసీలో వాటా అమ్ముతామని 2020 ఫిబ్రవరిలోనే ఫైనాన్స్​ మినిస్టర్​ ప్రకటించారు. కానీ, కరోనా వలన ఎల్​ఐసీ ఐపీఓ ఆలస్యమయ్యింది. ఇదే ఫైనాన్షియల్​ ఇయర్లో మరో ఆరు ప్రభుత్వ రంగ కంపెనీలలోనూ వాటాలు అమ్మాలని ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకున్నట్లు దీపమ్​ సెక్రటరీ చెప్పారు. డిసెంబర్–జనవరి కల్లా ఈ కంపెనీలకు ఫైనాన్షియల్​ బిడ్లు పిలవనున్నట్లు పేర్కొన్నారు.