లిక్కర్ లారీ బోల్తా.. సుమారు 25 లక్షల బీర్లు నేలపాలు

లిక్కర్ లారీ బోల్తా.. సుమారు 25 లక్షల బీర్లు నేలపాలు

భీమదేవరపల్లి, వెలుగు:  హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల సమీపంలో బుధవారం తెల్లవారుజామున  కల్వర్టును ఢీకొని లిక్కర్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ బాలు దాస్,  క్లీనర్ నరేశ్ క్షేమంగా బయటపడ్డారు.  

సంగారెడ్డి యువీ డిస్టిలరీ నుంచి హనుమకొండ డిపో 1 కు సుమారు రెండు వేల కింగ్ ఫిషర్ బీర్ల పెట్టెలను లారీలో తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.  లారీలో దాదాపు  రూ. 25 లక్షల విలువ చేసే లిక్కర్ కిందపడిపోయింది.  లిక్కర్ బాటిల్స్ అపహరణకు గురికాకుండా ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్, ఎస్సె తిరుపతి, సిబ్బంది ఖలీల్, లాల, రవీందర్, ముల్కనూరు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.