బాసర క్షేత్రంలో పెద్దఎత్తున అక్షరాభ్యాసాలు

బాసర క్షేత్రంలో పెద్దఎత్తున అక్షరాభ్యాసాలు

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో నిన్న వసంత పంచమి సందర్భంగా పెద్దఎత్తున అక్షరాభ్యాసాలు జరిగాయి. దాదాపు 4046 మంది చిన్నారులకు రూ.1000 మండపంలో, 2826 మంది చిన్నారులకు రూ.150 మండపంలో అక్షరాభ్యాసాలు చేసినట్టు తెలుస్తోంది. కాగా నిన్న ఒక్కరోజే అక్షరాభ్యాసాలతో ఆలయానికి రూ.44,69,900 ఆదాయం వచ్చినట్టు సమాచారం. ఇక వసంత పంచమి నేపథ్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో అధిక రద్దీతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.