ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్

స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం ఐదు జిల్లాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండుస్థానాలకు ఎన్నికలు జరగగా.. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో ఒక్కోస్థానానికి ఎన్నికలు జరిగాయి. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండు చొప్పున, నిజామాబాద్, వరంగల్ లో ఒక్కో సీటు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరుస్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈనెల 14న ఫలితాలు విడుదల చేయనున్నారు ఎన్నికల అధికారులు