కరోనా విజృంభణ.. ఒడిశాలో లాక్‌డౌన్ 

కరోనా విజృంభణ.. ఒడిశాలో లాక్‌డౌన్ 

భువనేశ్వర్: ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో వైరస్ కట్టడి కోసం ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 14 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. మే 5 నుంచి 19వ తేదీ వరకు లాక్‌‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి, కరోనాను కంట్రోల్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఒడిశాలో నిన్న ఒక్కరోజు 10 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.