లాక్ డౌన్ మాత్రమే సరిపోదు..WHO హెచ్చరిక

లాక్ డౌన్ మాత్రమే సరిపోదు..WHO హెచ్చరిక

కరోనా వైరస్ ను అంతం చేయాలంటే దేశాలు ఎక్కడికక్కడ లాక్ డౌన్ చేసుకున్నంత మాత్రాన సరిపోదని డబ్ల్యూహెచ్ఓ టాప్ ఎమర్జెన్సీ నిపుణుడు మైక్ ర్యాన్ హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ.. వైరస్ మళ్లీ విజృంభించకుండా పూర్తిస్థాయి పబ్లిక్ హెల్త్ చర్యలు తీసుకోవడమే సరైనదన్నారు. ‘ముందుగా వైరస్ బారిన పడ్డ వాళ్లందరినీ గుర్తించడంపై ఫోకస్ పెట్టాలి .తర్వాత వాళ్లను ఐసోలేట్ చేయాలి. ఆ తర్వాత వాళ్లతో కాంటాక్ట్ అయిన వాళ్లనూ గుర్తించి ఐసోలేట్ చేయాలి” అని చెప్పా రు. ‘వైరస్ ను అంతం చేసేందుకు ఎక్కడికక్కడ లాక్ డౌన్స్ చేసుకుంటున్నారు. కానీ .. లాక్ డౌన్స్ ఎత్తేసిన తర్వాత వైరస్ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉంటుంది. అందుకే లాక్ డౌన్స్ చేయడమేకాదు.. వైరస్ మళ్లీ చెలరేగిపోకుండా ఇప్పుడే పబ్లిక్ హెల్త్ పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి” అని ర్యాన్ సూచించారు