మేడ్చల్‌‌‌‌‌‌‌‌లో లోహియా ప్లాంట్ ప్రారంభం

మేడ్చల్‌‌‌‌‌‌‌‌లో లోహియా ప్లాంట్ ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  లోహియా గ్రూప్ మేడ్చల్‌‌‌‌‌‌‌‌లోని తన కొత్త  బిస్కెట్ తయారీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను బుధవారం ప్రారంభించింది.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీనిని నిర్మించామని కంపెనీ చెబుతోంది. మొత్తం ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో  నెలకు 1,000 టన్నుల బిస్కెట్లు ఉత్పత్తి అవుతాయి.  మాడ్యులర్ సామర్థ్యాలతో 5,000 టన్నుల వరకు  పెంచుకునే అవకాశం ఉంది. 

గత నాలుగేండ్లలో రూ.300 కోట్లను లోహియా కన్ఫెక్షనరీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్‌‌‌‌‌‌‌‌సీపీఎల్‌‌‌‌‌‌‌‌) ఇన్వెస్ట్ చేసింది. ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌తో  6,000 మందికి ఉపాధి దొరుకుతుందని, ఇందులో 2,000 మంది  సైట్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తారని కంపెనీ పేర్కొంది.