న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌‌పై రామమందిరం, రాముడి చిత్రాలు

న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌‌పై రామమందిరం, రాముడి చిత్రాలు
  • ఆగస్టు 5న ప్రదర్శించనున్న అమెరికన్‌ ఇండియన్స్‌
  • రామమందిర శంకుస్థాపనను పురస్కరించుకుని

న్యూయార్క్‌: ఆగస్టు 5న అయోధ్య రామమందిరం చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన రోజు. ఆలయం శంకుస్థాపన జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ఉత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌‌లో బిల్‌బోర్డ్స్‌ మీద రామాలయం, రాముడి ఫొటోలు, రామనామం, శంకుస్థాపన జరుగుతున్న వీడియోలను 3డీ పోర్ట్‌రైట్స్‌లో డిస్‌ప్లే చేయనున్నారు. అమెరికన్‌ ఇండియా పబ్లిక్‌ అఫైర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జగదీశ్‌ శివ్హనీ అన్నారు. అయోధ్యలో చరిత్రాత్మక కార్యక్రమం జరగనుందని, అందుకే ఈ సెలబ్రేషన్స్‌ ప్లాన్‌ చేశామని ఆయన అన్నారు. ఆగస్టు 5న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఈ డిస్‌ప్లే ఉంటుందని ఆయన చెప్పారు. ఇండియన్‌ కమ్యూనిటీకి చెందిన వారు ఆరోజు అక్కడ గ్యాదర్‌‌ అవుతారని, ఈ సందర్భంగా స్వీట్లు పంచుకుని సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారని అన్నారు. “ ఇది చరిత్రలో ఒక్కసారే జరుగుతుంది. దాన్ని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోవాలి. దానికి ఈ టైమ్‌స్క్వేర్‌‌ ఐకానిక్‌ మంచి ప్లేస్‌” అని శవ్హనీ అన్నారు. శంకుస్థాపన జరగడం అనేది ప్రపంచంలోని హిందువులందరి కోరిక అని, అది ప్రధాని చేతుల మీదుగా జరగడం చరిత్ర అని ఆయన అభిప్రాయపడ్డారు. అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న శంకుస్థాపన జరగనుంది. ప్రధాని నేరంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.