టీస్టాల్ ​మీదకు  దూసుకెళ్లిన లారీ

టీస్టాల్ ​మీదకు  దూసుకెళ్లిన లారీ

ఘాజిపూర్: వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాల మీదకు దూసుకెళ్లిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్​రాష్ట్రంలోని ఘాజిపూర్​జిల్లా మహమ్మదాబాద్​మండలం అహిరౌలి గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహిరౌలిలో రోడ్డు పక్కన ఉన్న ఓ స్టాల్​వద్ద కొందరు మంగళవారం ఉదయం టీ తాగుతుండగా.. అటుగా వెళ్తున్న ఓ లారీ వేగంగా వారి మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ యువకుడు సహా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు లారీ డ్రైవర్​ను పట్టుకొని చితకబాదారు. జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.