హైదరాబాద్​లో లారీ బీభత్సం.. ఇద్దరికి సీరియస్​

హైదరాబాద్​లో లారీ బీభత్సం.. ఇద్దరికి సీరియస్​

మౌలాలి ఫ్లైఓవర్​ వద్ద జీహెచ్​ఎంసీ  లారీ డ్రైవర్​ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం.. జూన్​30న లాలాపేట్​ నుంచి మౌలాలి వైపు ఫ్లై ఓవర్​ మీదుగా వెళ్తున్న ఓ లారీ ఓవర్​ స్పీడ్​తో వచ్చింది. దీంతో అదుపు తప్పి రాంగ్​రూట్​లో వెళ్లి పలు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసం కాగా.. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని ఆసుపత్రికి తరలించారు. 

వారి పరిస్థితి సీరియస్​గా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. డివైడర్​, కరెంట్​ స్తంభం తదితర వస్తువులు ధ్వంసమయ్యాయి. డ్రైవర్​ పరారీలో ఉన్నాడు. అతను మద్యం మత్తులో ఉన్నాడా.. లేదా మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఫ్లై ఓవర్​పై ట్రాఫిక్ జామ్​ అయింది. వివిధ పనులకు వెళ్లే వారు ట్రాఫిక్​లో చిక్కుకుపోయి ఇబ్బంది పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.