దేశం కోసం.. ప్రేమ కోసం : యుద్దానికి వెళ్తూ పెళ్లి చేసుకున్నాడు..

దేశం కోసం.. ప్రేమ కోసం : యుద్దానికి వెళ్తూ పెళ్లి చేసుకున్నాడు..

డ్యూటీకి పిలిచిన వేలాది మంది ఇజ్రాయిలీ మిలిటరీ రిజర్విస్ట్‌లలో ఉరి మింట్జెర్, ఎలినోర్ యోసెఫిన్ కూడా ఉన్నారు. వారు తమ యూనిట్‌లకు నివేదించే ముందు ఆకస్మిక వివాహ వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ యువ జంట థాయ్‌లాండ్‌లో ప్రయాణిస్తుండగా హమాస్ విధ్వంసక దాడి జరిగింది. దీంతో వారు వెంటనే ఇంటికి చేరుకున్నారు.

"నేను ఈ క్షణం గురించి వేలసార్లు ఆలోచించాను, కానీ నేను ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు" అని మింట్జెర్ ఈ సందర్భంగా స్పందించాడు." మేము కోరుకున్నట్లుగా త్వరలో పూర్తి వివాహాన్ని జరుపుకోగలమని నేను పూర్తిగా ఆశిస్తున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడ్డాను. ఆమే నా గతం, వర్తమానం, భవిష్యత్తు" అని చెప్పుకొచ్చాడు.

సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని షోహామ్‌లో సాంప్రదాయ వివాహ పందిరి కింద ఈ జంట వారి తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో మాత్రమే ప్రతిజ్ఞలు చేసుకున్నారు. ఆ తర్వాత 3లక్షల మంది రిజర్విస్టులను విధుల కోసం సమీకరించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి రియర్ అడ్మ్ డేనియల్ హగారి తెలిపారు.  "యుద్ధానికి వెళ్లే సందర్భంగా ఈ జంట వివాహం చేసుకోవడం అనేది వారి బంధం, ప్రేమ బలంగా ఉండేందుకు నిదర్శనం" అని రబ్బీ చెప్పారు.