చెట్టుకు ఉరేసుకున్న ప్రేమజంట.. కుళ్లిన మృతదేహాలు

చెట్టుకు ఉరేసుకున్న ప్రేమజంట.. కుళ్లిన మృతదేహాలు

నిజామాబాద్ లో దారుణం జరిగింది. చందూర్ మండలం లక్ష్మాపూర్ అడవి ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ప్రేమజంట. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మోస్రా మండలం తిమ్మాపూర్ కి చెందిన మోహన్, లక్ష్మిగా గుర్తించారు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నాయి. వారం రోజుల క్రితమే ప్రేమికులిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు పోలీసులు.