

‘‘ప్రేమ వివాహాలతో పాటు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కూడా చేస్తాం. ఇక్కడ వివాహం చేసుకున్న వారు ఆలయంలో పెళ్లిరోజు వేడుకలు కూడా చేసుకుంటారు’’ అని ఆలయ అర్చకులు తిరు ణగిరి వేంకటాద్రి చార్యులు వివరించారు. మంథని ఆలయంలో…మంథనిలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఎనిమిదేళ్లలో 500కు పైగా ప్రేమ పెళ్లిళ్లు జరిగాయి. ఇక్కడి లక్ష్మీనారాయణ స్వామికి చింతపండు స్వామిగా కూడా పేరుం ది. పూర్వం వీణవంకలో కొలువుదీరిన లక్ష్మీనారాయణ స్వామి.. అక్కడ నైవేద్యం పెట్టేవారు లేకపోవడంతో బ్రాహ్మణులు ఉండే ప్రాంతానికి వెళ్తానని చెప్పాడని, తర్వా త వ్యాపారులు చింతపండును తెచ్చే ఎడ్లబండ్లపై వచ్చి ఇక్కడ కొలువుదీరినట్లు పండితులు చెబుతున్నారు. అందుకే చింతపండు స్వామిగా పిలు స్తారు. ఆదిలాబాద్, చిత్తూరు, తిరుపతితో పాటు వివిధ ప్రాంతాలవారు ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అన్ని సర్టిఫికెట్లు పరిశీలిం చి మేజర్ అని నిర్ధా రించుకున్నాకే వివాహం చేస్తున్నారు. ఇక్కడ 2005లో తొలిసారిగా మంథనికి చెందిన బండారి వరప్రసాద్, అనిత వివాహం జరిగింది.