పెద్ద‌ల‌కు దూరంగా ఉండ‌లేక… ఒకే తాడుతో ఉరేసుకున్న ప్రేమజంట‌

పెద్ద‌ల‌కు దూరంగా ఉండ‌లేక… ఒకే తాడుతో ఉరేసుకున్న ప్రేమజంట‌
ఏపీలోని గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్తెనపల్లి వివేకానందనగర్ లో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివేకానంద న‌గ‌ర్‌కు చెందిన తాపీ మేస్త్రీ కిర‌ణ్.. అదే ప్రాంతానికి చెందిన ఇంట‌ర్ విద్యార్ధిని ప్రదీప్తీ ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇరువురి కుటంబాల్లో తెలియ‌డంతో ఇద్ద‌రి కులాలు వేరుకావడంతో వీరి పెళ్లిని వ్యతిరేకించారు. దీంతో ఇద్దరూ ఇంట్లోనుంచి పారిపోయి ఆదివారం రాత్రి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెద్దలకు దూరంగా వెళ్లి బ్రతకలేమని భావించిన వీరిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు ఒకే తాడుతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.