మత్తు కంటే గౌరవప్రదమైన జీవితమే గొప్ప : శివనాయక్

మత్తు కంటే  గౌరవప్రదమైన జీవితమే గొప్ప  : శివనాయక్
  • భద్రాచలం జ్యుడిషియల్​ ఫస్ట్ క్లాస్​ మెజిస్ట్రేట్​ శివనాయక్​ 

భద్రాచలం,వెలుగు : తాత్కాలికంగా మత్తు కల్గించే ఆనందం కన్నా జీవితంలో ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడు సమాజం మనకు ఇచ్చే ఆనందం కోటిరెట్లు గొప్పదని భద్రాచలం జ్యుడిషియల్​ ఫస్ట్ క్లాస్​ మెజిస్ట్రేట్​ పి.శివనాయక్​ విద్యార్థులకు సూచించారు. భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గురువారం జిల్లా న్యాయ సేవలు ప్రాధికార సంస్థ నిర్వహించిన మత్తు మందుల అవగాహన, న్యాయ అవగాహన, ఆరోగ్య సంక్షేమ మార్గ నిర్ధేశపథకంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 5 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో మత్తు పదార్ధాల వాడకం, ఎదురయ్యే అనర్ధాలపై విపులంగా వివరించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డాక్టర్​ కె.జాన్​మిల్టన్​, భద్రాచలం జ్యుడిషియల్​ ఫస్ట్ క్లాస్​ మెజిస్ట్రేట్​ దుర్గ భవానీ, బార్​ అసోషియేషన్​ అధ్యక్షుడు దేవదానం, శిశు, సంక్షేమ అధికారి రూప తదితరులు పాల్గొన్నారు.