
హైదరాబాద్, వెలుగు: పరుపులు అమ్మే మాగ్నిఫ్లెక్స్ రిమోట్ కంట్రోల్తో పనిచేసే పరుపును మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘ఎర్గో ట్రీ ఎలక్ట్రిక్’ పరుపును కరెంట్తో ఆపరేట్ చేయొచ్చు. ఇందులో మోటార్ ఉంటుంది. కరెంట్ లేకపోతే సాధారణ బెడ్గా వాడుకోవచ్చు. ధర రూ.3 లక్షలు. కంపెనీ తన ప్రొడక్ట్లను రూ.85 వేల నుంచి రూ. 6 లక్షల మధ్య అమ్ముతోంది. తమకు ఇటలీలో మాత్రమే తయారీ ప్లాంట్ ఉందని మాగ్నిఫ్లెక్స్ ఇండియా ఎండీ ఆనంద్ నిచాని అన్నారు.