రిమోట్‌‌తో పనిచేసే మాగ్నిఫ్లెక్స్ పరుపు

రిమోట్‌‌తో పనిచేసే మాగ్నిఫ్లెక్స్ పరుపు

హైదరాబాద్‌‌, వెలుగు: పరుపులు అమ్మే  మాగ్నిఫ్లెక్స్‌‌ రిమోట్‌‌ కంట్రోల్‌‌తో పనిచేసే పరుపును మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. ‘ఎర్గో ట్రీ ఎలక్ట్రిక్‌‌’ పరుపును  కరెంట్​తో  ఆపరేట్ చేయొచ్చు. ఇందులో మోటార్ ఉంటుంది. కరెంట్ లేకపోతే సాధారణ బెడ్‌‌గా వాడుకోవచ్చు. ధర రూ.3 లక్షలు. కంపెనీ తన ప్రొడక్ట్‌‌లను రూ.85 వేల నుంచి రూ. 6 లక్షల మధ్య అమ్ముతోంది.  తమకు ఇటలీలో మాత్రమే తయారీ ప్లాంట్‌‌ ఉందని మాగ్నిఫ్లెక్స్‌‌ ఇండియా ఎండీ ఆనంద్‌‌ నిచాని అన్నారు.