ఇంటికి వస్తా.. లేకుంటే చనిపోతా.. మహబూబ్ నగర్ లో గురుకుల ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటికి వస్తా.. లేకుంటే చనిపోతా.. మహబూబ్ నగర్ లో గురుకుల ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
  • నాలుగు రోజుల కింద హాస్టల్ లో ఆమె రాసిన లెటర్​ లభ్యం 
  • తండ్రికి ఫోన్ లో సమాచారమిచ్చిన కాలేజ్ ​ప్రిన్సిపాల్​
  • హాస్టల్ ​బాత్​రూమ్​లో ఉరేసుకోగా.. 
  • యువకుడి వేధింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని తల్లి 

మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు: గురుకుల ఇంటర్​విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్​కు చెందిన నగేశ్, పద్మమ్మ దంపతుల కుమార్తె ప్రియాంక(16), మహబూబ్ నగర్ జిల్లాలోని రామిరెడ్డిగూడెం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల జూనియర్​కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. 

ఈనెల 6న విద్యార్థిని హాస్టల్​లో అనారోగ్యం బారిన పడగా సిబ్బంది వెళ్లి సపర్యలు చేశారు. అనంతరం విద్యార్థిని లగేజీ సర్దుతుండగా సూసైడ్ లెటర్ కనిపించింది. ‘ మీరు నాపైన ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. నేను చదువలేకపోతున్నా. నేను ఇంటికి వస్తా. తీసుకెళ్లండి. లేకుంటే చనిపోతా..’’ అని అందులో రాసి ఉంది. వెంటనే లెటర్​ను కాలేజ్​ప్రిన్సిపాల్​కు ఇవ్వగా.. విద్యార్థిని తండ్రికి ఫోన్​చేసి విషయం చెప్పారు. 

తన పెద్ద కూతురు అనారోగ్యంతో ఉందని, ఇప్పుడు హాస్టల్​కు రాలేనని సమాధానం ఇచ్చాడు. అనంతరం ప్రియాంకతో తండ్రి మాట్లాడుతూ మందలించాడు. కాగా.. సోమవారం ఉదయం ప్రియాంక క్లాస్​కు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్కూల్ సిబ్బంది బాత్​రూమ్​కి వెళ్లి చూడగా వెంటిలేటర్​కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, అంబులెన్స్ లో మహబూబ్​నగర్​ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

విద్యార్థిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. సమాచారం తెలియడంతో మహబూబ్​నగర్​కలెక్టర్​విజయేందిర బోయి ఆస్పత్రికి వెళ్లి విద్యార్థిని డెడ్ బాడీని పరిశీలించా రు. ఘటనపై ప్రిన్సిపాల్​ను అడిగి తెలుసుకుని, అనంతరం విద్యార్థిని తండ్రిని పరామర్శించారు. 

యువకుడి వేధింపులే కారణమా?

తన కూతురు మృతికి ఖాదర్ అనే యువకుడు కారణమని విద్యార్థిని తల్లి పద్మమ్మ సోమవారం సాయంత్రం మహబూబ్​నగర్​రూరల్​పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడు తన కుమార్తెకు లవ్​ లెటర్​ఇచ్చి తరచూ వేధింపులకు గురి చేసేవాడని, భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో తెలపగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్​ఎస్ఐ వినోద్ ​కుమార్​ తెలిపారు.