నారుబుట్ట ఎత్తిన ఎంపీ కవిత

నారుబుట్ట ఎత్తిన ఎంపీ కవిత

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వెంకట్ రామ్ తండాలో తీజ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ లు తీజ్ పందిరి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. గోధుమ నారు బుట్టలు ఎత్తుకుని గిరిజనులతో కలిసి ఆడిపాడారు. అంతకుముందు నరసింహుల గూడెంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు మాలోతు కవిత.