- బీజేపీపై చత్తీస్గఢ్ సీఎం బాఘెల్ఫైర్
రాయ్పూర్ : చత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల వేళ మహదేవ్ బెట్టింగ్ యాప్ ఇష్యూ కలకలం సృష్టిస్తోంది. ఈ విషయంలో బీజేపీ చేసిన ఆరోపణలను సీఎం భూపేశ్ బాఘెల్ తిప్పికొట్టారు. బెట్టింగ్ యాప్ను చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'బీజేపీ ఈ నెల 17 వరకు ఎంజాయ్ చేస్తుంది. అయితే, ఈ ఆరోపణలు ఎలక్షన్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపవు. ఇలాంటి ప్రయత్నాలను ఎన్నికల సంఘం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? దీనిపై మేము ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నంపై ఎంక్వైరీ జరగాలి’’ అని బాఘెల్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే మహాదేవ్ బెట్టింగ్ యాప్పై కేంద్రం నిషేధం విధించడంలేదని బాఘెల్ ఆరోపించారు. యాప్ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆగస్టులోనే తాము కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. మరోవైపు, దుబాయ్లో ఉన్న యాప్ ఓనర్ శుభమ్ సోని మాట్లాడిన వీడియో ఒకటి ఆదివారం వైరల్గా మారింది. సీఎం బాఘెల్సలహా మేరకే తాను దుబాయ్కి మకాం మార్చానని సోని పేర్కొన్నారు. సీఎంకు ఇప్పటివరకు రూ.508 కోట్లు చెల్లించానని అందులో చెప్పాడు. బెట్టింగ్ యాప్కు అసలైన యజమాని బాఘెలేనని పేర్కొన్నాడు.