కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం,వ్యాక్సినేషన్ ప్రక్రియ పెరగడంతో స్కూల్స్ పునఃప్రారంభించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కోవిడ్ రూల్స్ పాటించేలా తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టనుంది. ఫిబ్రవరి 1 నుంచి పుణేలో స్కూళ్లు, కాలేజీలు తెరుస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. 1 నుంచి 8వ తరగతి క్లాసులు హాఫ్ డే నిర్వహిస్తామన్నారు. 9, 10వ తరగతి క్లాసులు, కాలేజీలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయన్నారు. పిల్లలు స్కూళ్లకు రావడానికి తల్లిదండ్రుల సమ్మతి అవసరమన్నారు అజిత్ పవార్.
Schools & colleges will reopen in Pune district from Feb 1. For classes 1 to 8, the school timings will be half of the regular timings, but for classes 9 to 10, the school will run as per the regular schedule. Colleges will also function as per regular time: Maharashtra Deputy CM pic.twitter.com/hzGbi8tfnw
— ANI (@ANI) January 29, 2022
మరిన్ని వార్తల కోసం