మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి

మహారాష్ట్ర భివాండీ పట్టణంలోని ధోబీ తలావో ప్రాంతంలో శనివారం(సెప్టెంబర్ 02) అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలడంతో.. 8 నెలల శిశువుతో సహా ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పాట్ కు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. శిథిలాల నుంచి ఏడుగురిని అధికారులు రక్షించారు. గాయపడిన వారిలో నలుగురు మహిళలు, 65 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నాడు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

సమాచారం అందుకున్న థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీడీఆర్‌ఎఫ్ ఘటనాస్థలికి చేరుకుంది. ధోబీ తలావ్‌లోని దుర్గా రోడ్‌లోని రెండంతస్తుల ఇంట్లో ఆరు ఫ్లాట్లు ఉన్నాయని థానే మున్సిపల్ డిజాస్టర్ రెస్పాన్స్ సెల్ హెడ్ యాసిన్ తార్వి తెలిపారు. 

ఈ రెండంతస్తుల భవనం 40 ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు తెలిపారు. గతంలో భవనం శిథిలావస్థలో ఉండడంతో మున్సిపాలిటీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. కానీ భవనం యజమాని మున్సిపల్ అధికారులు పంపించిన నోటీసులను పట్టించుకోలేదు.