మహారాష్ట్రలో ఉదయమే భూకంపం

మహారాష్ట్రలో ఉదయమే  భూకంపం

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో భూకంపం సంభవించింది.  2023 ఆగస్టు 16 బుధవారం రోజున ఉదయం 06:45 నిమిషాలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.  5 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని తెలిపింది.  అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. భూమి కంపించడంతో జనాలు భయపడి ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.