రన్నింగ్ బస్సులో మంటలు..25 మంది సజీవ దహనం

రన్నింగ్ బస్సులో మంటలు..25 మంది సజీవ దహనం

మహారాష్ట్రలో జులై 1వ తేదీ శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవదహనమయ్యారు. యావత్ మాల్ నుంచి పూణే వెళుతుండగా ఈ ఘటన జరిగింది.  సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వేపై బస్సు వెళుతుండగా బుల్దానా వద్ద బస్సులో అకస్మా్త్తుగా  మంటలు చెలరేగాయి.  ఈ మంటల్లో బస్సులోని 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. 

బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. బస్సులో మంటలు వ్యాపించిన సమయంలో కొంత మంది బయటకుదూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో  8మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బుల్దానా సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  బస్సు వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగి  మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.