నవంబర్ 13 నుంచి ఎంజీయూ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు

నవంబర్ 13 నుంచి ఎంజీయూ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 30 ప‌‌రీక్ష కేంద్రాలు
  • హాజరుకానున్న 18,827 మంది విద్యార్థులు

నల్గొండ, వెలుగు: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నల్గగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో సెమిస్టర్ 1, 3, 5 రెగ్యులర్‌‌‌‌ అండ్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 13 నుంచి డిసెంబర్ 1 వరకు వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే యూనివర్సిటీ షెడ్యూల్ విడుదల చేసింది. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18,827 మంది విద్యార్థులు హాజరవుతుండగా 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు ఆన్‌‌లైన్ ప్రశ్నాపత్రంతో పాటు సంబంధించిన మెటీరియల్స్​ను ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు సరఫరా చేశారు.

 పరీక్షల్లో పారదర్శకత కోసం సిట్టింగ్ స్క్వాడ్‌‌తో పాటు ఫ్లయింగ్ స్కాడ్స్ బృందాలను ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో 12 పరీక్షాకేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో 2, యాదాద్రి భునగిరి జిల్లాలో 3  సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 18,827 మంది హాజరుకానుండగా.. 1వ సెమిస్టర్‌‌లో 5,400 మంది, 3వ సెమిస్టర్‌‌లో 5,830, 5వ సెమిస్టర్‌‌లో 5,597 మంది విద్యార్థులు ఉన్నారు.

పటిష్ట ఏర్పాట్లు చేశాం.. 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంజీయూ పరిధిలో నిర్వహించే డిగ్రీ సెమిస్టర్ 1, 3, 5 రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షలు సజావుగా సాగేలా వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్టర్ అల్వాల రవి ఆదేశాలతో సిట్టింగ్, ఫ్లయింగ్ స్వ్కాడ్ ఏర్పాటు దేశాం. పరీక్ష కేంద్రాల్లో ఏమైనా తప్పులు జరిగితే ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్‌‌ సూపరింటెండెంట్స్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.  డా. జి.ఉపేందర్‌‌రెడ్డి, సీఓఈ, ఎంజీయూ