అయోధ్య ఆలయ నిర్మాణానికి మహావీర్ ట్రస్ట్  రూ. 10 కోట్ల విరాళం

అయోధ్య ఆలయ నిర్మాణానికి మహావీర్ ట్రస్ట్  రూ. 10 కోట్ల విరాళం

అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం భారీ ఎత్తున విరాళాలు రానున్నాయి. లేటెస్టుగా  ఆలయ నిర్మాణానికి రూ. 10 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్టు బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న మహావీర్ మందిర్ ట్రస్టు ప్రకటించింది. ఈ మొత్తాన్ని విడతల వారీగా అందజేస్తామని చెప్పారు. మొదటి విడతగా రూ. 2 కోట్లు ఇస్తున్నామని.. దీనికి సంబంధించిన చెక్ తీసుకుని అయోధ్యకు వెళ్తున్నామని చెప్పింది.

తమ ట్రస్ట్  దగ్గర రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయస్వామిలతో కూడిన 30 నాణేలు ఉన్నాయని… వీటిని 1818లో అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ విడుదల చేసిందని మహావీర్ మందిర్ ట్రస్ట్ తెలిపింది. అయోధ్య ఆలయ నిర్మాణం కోసం వీటిని దాచి ఉంచామని ట్రస్ట్ నిర్వాహకులు చెప్పారు. ఏప్రిల్ 2న శ్రీరామనవమి సందర్భంగా ఆలయ నిర్మాణం ప్రారంభంకానుంది.