మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తొర్రూరు పట్టణానికి చెందిన శ్రీ నలంద పాఠశాల స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బొడ్లాడ గ్రామ విద్యార్థులను తీసుకుని రావడానికి వెళ్తుండగా.. దంతాలపల్లి శివారులో అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 35 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్కూల్ బస్సు డ్రైవర్ పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.