మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో హార్టికల్చర్, అగ్రికల్చర్, సహకార శాఖల అధికారులతో ఆయిల్ పామ్ సాగుపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 1,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ చేయాలని లక్ష్యం ఉండగా, 714 ఎకరాలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చామని తెలిపారు. 303 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు పెట్టించామని, మిగిలిన 1,197 ఎకరాల్లో వచ్చే రెండు నెలల్లో ఆయిల్పామ్ సాగయ్యేలా చూడాలన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ కె వేణుగోపాల్, డీఏవో వెంకటేశ్, జిల్లా సహకార అధికారి కృష్ణ, బాలరాజు పాల్గొన్నారు.
