
రేంజ్ రోవర్.. ఇండియాలోని కాస్ట్ లీ కార్లలో ఇదొకటి. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల్లాంటి వారు మెయింటెన్ చేస్తుంటారు. టాలీవుడ్ లో ఇప్పటికే చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఈ కారును తీసుకున్నారు. లేటెస్ట్ గా రేంజ్ రోవర్ కొనుగోలు చేసిన హీరోల లిస్టులో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేరారు.
మహేశ్ బాబు రేంజ్ రోవర్ కారు కొన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని కాస్ట్ 5.4 కోట్లని ప్రచారం జరుగుతోంది. అయితే హైదరాబాద్ లో గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారు కొన్న ఏకైక వ్యక్తి మహేశ్ బాబు అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారును హైదరాబాద్ రోడ్లపై తిరిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.