
నిజామాబాద్, వెలుగు : ఎలక్షన్లో ఎవరు పోటీ చేయాలనే విషయాన్ని డిసైడ్ చేసేది పార్టీ అధిష్ఠానమని, ఆ విషయాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్ను పవర్లోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ కోరారు. సోమవారం ఆయన కొత్తగా అపాయింటైన మండల, బ్లాక్కాంగ్రెస్ ప్రెసిడెంట్లతో డీసీసీ ఆఫీస్లో మీటింగ్నిర్వహించి మాట్లాడారు. ఎవరు పార్టీలోకి రావాలన్నా, తలుపులు తెరిచే ఉంటాయన్నారు. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం ఉంటాయన్నారు. గ్రూపులు కట్టేవారిని బయటకు పంపుతామని వార్నింగ్ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు మోహన్రెడ్డి, అనుబంధ సంఘాల లీడర్లు ముప్ప గంగారెడ్డి, శేఖర్గౌడ్, విక్కీయాదవ్, వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు.