
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మహేష్కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. శ్రీలీల మరో హీరోయిన్. ఇటీవల ఈ మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. మహేష్ బాబుతో పాటు ప్రధాన పాత్రలపై భారీ సెట్లో కీలక సన్నివేశాలను తీస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు జయరామ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు ఆయనే కన్ఫర్మ్ చేశారు. సెట్లో మహేష్తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన జయరామ్.. ‘థియేటర్లలో కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన కొడుకు, గొప్ప వ్యక్తి మహేష్ బాబుతో పని చేస్తున్నాను. ‘అల వైకుంఠపురంలో’ తర్వాత మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం హ్యాపీగా ఉంది’ అని పోస్ట్ చేశారు. మహేష్ కెరీర్లో ఇది 28వ చిత్రం. ఆగస్టు 11న రిలీజ్ చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ ఓటీటీ, ఓవర్సీస్ రైట్స్ రికార్డు ధరకి అమ్ముడుపోయాయని, తెలుగు రాష్ట్రాల్లో కూడా బిజినెస్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని సమాచారం. ఉగాదికి ఈ సినిమా టైటిల్ రివీల్ చేయనున్నట్టు తెలుస్తోంది.