న్యూఢిల్లీ: ఇంజిన్లో వైరింగ్ సమస్యలున్నాయని లక్షకు పైగా ఎక్స్యూవీ 700 కార్లను మహీంద్రా అండ్ మహీంద్రా రీకాల్ చేస్తోంది. ‘జూన్ 8, 2021 నుంచి జూన్ 28, 2023 మధ్య తయారైన 1,08,306 ఎక్స్యూవీ 700 కార్లను రీకాల్ చేస్తున్నాం. ఇంజిన్ బేలో వైరింగ్ సమస్యలు ఉండడమే కారణం’ అని కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో పేర్కొంది.
ఫిబ్రవరి 16, 2023 – జూన్ 5, 2023 మధ్య తయారైన 3,560 ఎక్స్యూవీ 400 కార్లను కూడా తనిఖీ చేస్తామని, బ్రేక్ సమస్యలు ఉండొచ్చని వివరించింది. కంపెనీ కాంటాక్ట్ అయిన కస్టమర్లందరికీ ఫ్రీగా ఈ తనిఖీ చేస్తామని పేర్కొంది.