
న్యూఢిల్లీ: మహీంద్రా హాలిడేస్ అండ్ రిసోర్ట్స్ తన బిజినెస్ను మరింతగా విస్తరించాలని చూస్తోంది. రూమ్స్ సంఖ్యను పెంచాలనుకుంటోంది. ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2,000 కోట్లు ఖర్చు చేయనుంది. ‘రిసోర్ట్లలోని రూమ్లను పెంచాలని చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న 5,000 నుంచి 10 వేలకు వచ్చే ఆరేళ్లలో పెంచుతాం.
వచ్చే రెండేళ్లలో 639 కొత్త రూమ్లను అందుబాటులోకి తీసుకురావడానికి రూ.835 కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నాం. మొత్తంగా 2024–25 లో రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తాం’ అని కంపెనీ ఎండీ కవిందర్ సింగ్ వెల్లడించారు. రూమ్లలో దిగేవారు పెరిగారని, ఆక్యుపెన్సీ రేషియో 84–85 శాతానికి చేరుకుందని చెప్పారు. ఈ నెంబర్ 90 శాతానికి చేరుకుంటుందని అంచనా వేశారు.