బోధన్​లో యువకుడి దారుణ హత్య... మర్మాంగాలు కోసి మర్డర్​

బోధన్​లో యువకుడి దారుణ హత్య... మర్మాంగాలు కోసి మర్డర్​

బోధన్,​ వెలుగు:   నిజామాబాద్​జిల్లా బోధన్​లో  ఓ యువకుడి ప్రైవేట్ పార్ట్స్​ కోసి దారుణంగా హత్య చేశారు.  టౌన్​ సీఐ ప్రేమ్​కుమార్​తెలిపిన వివరాల ప్రకారం..  పట్టణంలోని ​రెంజల్​బేస్​కు చెందిన మాజీద్​ఖాన్​(24) అనే యువకుడు మెకానిక్​గా పనిచేస్తున్నాడు.  ఆదివారం రాత్రి బోధన్,  శక్కర్​నగర్​ప్రాంతంలోని కూలిన ఓ పాత ఇంట్లో మాజీద్​ఖాన్​రక్తపు మడుగుల్లో పడి ఉండడంతో అతడి​కుటుంబసభ్యులకు  ఫ్రెండ్​ ఆరిఫ్  సమాచారం అందించాడు.  

తీవ్ర గాయాలతో ఉన్న మాజీద్​ఖాన్​కు అతడి  సోదరుడు సాజీద్, ఆరిఫ్​ బోధన్​గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు.  మాజీద్​ఖాన్​స్నేహితులే హత్యచేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. మాజీద్​అన్న సాజీద్​ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి, విచారిస్తున్నట్లు సీఐ ​తెలిపారు.