హైదరాబాద్, వెలుగు : నియోజకవర్గాల్లో ఈ నెల 25న నిర్వహించే బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశాల్లో ఆరు అంశాలపై తీర్మానాలు చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇన్చార్జీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో ఆయన టెలికాన్ఫరెన్స్నిర్వహించారు.
ప్రతినిధుల సభలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ఒక్కో నియోజకవర్గంలో 2,500 నుంచి 3 వేల మందితో సభలు పెట్టాలని సూచించారు. ఈ ప్రతినిధుల సభలు వచ్చే ఎన్నికలకు బలమైన పునాది రాళ్లు కావాలని, కేసీఆర్హ్యాట్రిక్విజయానికి దోహదం చేయాలన్నారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో మారిన రాష్ట్ర ముఖచిత్రం గురించి సమావేశాల్లో చర్చించాలన్నారు.
వ్యవసాయం, సంక్షేమం, పల్లె – పట్టణ ప్రగతి, విద్య – ఉపాధి, బీజేపీ వైఫల్యాలు, స్థానిక అంశాలపై చర్చించి తీర్మానాలు చేయాలన్నారు. ప్రజలను ఆలోచింపజేసేలా తీర్మానాలు ఉండాలన్నారు.