చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలో టాలీవుడ్ లో బోలేడు ఉన్నాయి . అందులో బేబీ మూవీ ఒకటి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వసూళ్లు రాబట్టింది. మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. ఆనంద్, వైష్ణవి కలిసి మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టి్ంగ్ గా ఉంది. ఏడుస్తూ ఉన్న వైష్ణవిని ఆనంద్ ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తు్ంది. చూస్తుంటే ఇది కూడా ఓ విరహ ప్రేమకథే అన్నట్లుగా కనిపిస్తుంది. బేబీలో విడిపోయిన వీరిద్దరూ మరి ఈ సినిమాలో కలుస్తారా అన్నది ఇంట్రెస్టింగ్.
బేబీ దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమాకి కథ అందిస్తుండగా... నిర్మాత ఎస్కేఎన్తో కలిసి ఈ చిత్రాన్ని రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రవి నంబూరి దర్శకుడిగా మారబోతున్నాడు. అంతకముందు రవి నంబూరి.. ‘3 రోజెస్’ వెబ్సిరీస్కు రచయితగా, ‘ప్రతిరోజూ పండగే’కు కో రైటర్, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమా 2024 సమ్మర్ కు రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఆనంద్, వైష్ణవి కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.