
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య
జీడిమెట్ల, వెలుగు: కుల ధ్రువీకరణ పత్రాల మంజూరులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్ అన్నారు. కుత్బుల్లాపూర్ మండల కార్యాలయం ముందు శుక్రవారం రాష్ట్ర కార్యదర్శి కె.రాజేశ్ ఆధ్వర్యంలో నిసరన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు జె.చందు, సుధీర్, కె.సురేశ్ఖాన్, మధు తదితరులు పాల్గొన్నారు.