హైదరాబాద్, వెలుగు : సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్, దయ రిహాబిలిటేషన్ ట్రస్ట్ కలిసి రాష్ట్రంలోని చందానగర్ ప్రాంతంలో ‘గ్రాండ్మా హోమ్’, ‘హంగర్ ఫ్రీ వరల్డ్’ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ కార్యక్రమాలను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. గ్రాండ్మా హోమ్ కార్యక్రమం ద్వారా నిరుపేదలైన మహిళలకు ఆహారం, ఆశ్రయం, దుస్తులు అందిస్తారు.
అలానే వీరికి హెల్త్ సమస్యలు ఉంటే చూసుకుంటారు. ‘హంగర్ ఫ్రీ వరల్డ్’ క్యాంపెయిన్ ద్వారా ప్యాక్ చేసిన భోజనాన్ని నిరుపేదలకు ప్రతి రోజూ అందించనున్నారు. మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్, వైస్ చైర్మన్ కేపీ అబ్దుల్ సలాం, ఎండీ అషర్ ఓ, దయ రిహాబిలిటేషన్ ట్రస్ట్ ప్రాజెక్ట్ హెడ్ బాసిత్ వడక్కయిల్, తదితరులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.