
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ గురువారం ప్రారంభమయ్యాయి. సెకండ్ లాంగ్వేజీ పరీక్షలో 22 మంది స్టూడెంట్స్పై మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. రంగారెడ్డిలో 12, యాద్రాదిలో ఐదు, నిజామాబాద్లో రెండు, మహబూబ్నగర్, మెదక్, నారాయణపేట జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. పరీక్షకు మొత్తం 4,18,944 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 4,03,459 మంది పరీక్ష రాశారు. 15,483 మంది ఆబ్సెంట్ అయ్యారు.