మునుగోడు ఓటర్లకు మందు దావత్ ఇచ్చిన మల్లారెడ్డి

మునుగోడు ఓటర్లకు మందు దావత్ ఇచ్చిన మల్లారెడ్డి

మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న మంత్రి మల్లారెడ్డి ఓటర్లకు స్పెషల్​ దావత్ ఇస్తున్నారు. ఆదివారం చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ప్రచారం అయిపోగానే ఓ షెడ్డులో జనం, కార్యకర్తలకు మందు, విందు ఏర్పాటు చేశారు. అక్కడే సపరేట్ రూమ్ లో మంత్రి మల్లారెడ్డి స్వయంగా గ్రామస్తులకు ఇట్ల మందు పోసి అర్సుకున్నరు.

చౌటుప్పల్​, వెలుగు : మునుగోడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి మల్లారెడ్డి  మందు కలుపుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.  ఉప ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డికి చౌటుప్పల్​ మండలం ఆరెగూడెం, రెడ్డిగూడెం, కాట్రావు గ్రామాల ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొనే వారందరి కోసం హైవేపై ఉన్న లాడ్జీని బుక్​  చేసుకున్నారు. ప్రచారంలో భాగంగా చౌటుప్పల్​ మండలం ఆదివారం ఆరెగూడెంలో మంత్రి పర్యటించారు. కార్మిక శాఖ మంత్రి కాబట్టి కార్మికులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మీటింగ్​ ముగిసిన తర్వాత వచ్చిన వారందరికీ మందుతో కూడిన దావత్​ ఏర్పాటు చేశారు. మంత్రి మల్లారెడ్డి మాత్రం మిత్రపక్షాలైన కమ్యూనిస్టు లీడర్లతో పాటు టీఆర్ఎస్​కు చెందిన అసంతృప్త లీడర్లతో మాట్లాడారు. వారిని తాను బస చేసిన లాడ్జీకి తీసుకెళ్లారు. అక్కడ తన పక్కనే కూర్చోబెట్టుకొని ఉప ఎన్నికలు, బీజేపీ పరిస్థితి, టీఆర్​ఎస్​ పరిస్థితి గురించి ఆరా తీశారు. ఇదే సమయంలో కూర్చున్న చోటుకు మందు రావడంతో కమ్యూనిస్టు లీడర్లతో పాటు సొంత పార్టీ లీడర్లు, ప్రజా ప్రతినిధులకు స్వయంగా మంత్రి మందు పోశారు. ఈ ఫొటోనే ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.