బీసీ రిజర్వేషన్పై చట్టం తీసుకురావాలి

బీసీ రిజర్వేషన్పై చట్టం తీసుకురావాలి

మహబూబాబాద్​ అర్బన్, వెలుగు: బీసీ రిజర్వేషన్​పై 42శాతం అర్డినెన్స్​వద్దని, ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షురాలు మాలోత్​ కవిత అన్నారు. ఆదివారం బీఆర్ఎస్​ జిల్లా ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆమె మాజీ మంత్రి సత్యవతి రాథోడ్​తో కలిసి మాట్లాడుతూ ఎన్నికల ముందు బీసీ రిజర్వేషన్ 42 శాతం ఇస్తామని కాంగ్రెస్​ ప్రభుత్వం చెప్పి జాప్యం చేస్తుందని ఆరోపించారు.

 బీసీ మేధావులు బిల్లు వచ్చే వరకు పోరాటాలు చేయాలని, బీఆర్ఎస్​ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ప్రెస్​మీట్​లో మాజీ మున్సిపాలిటీ చైర్మన్​ డాక్టర్​ పాల్వయి రాంమోహన్​రెడ్డి, వైస్​ చైర్మన్​ మార్నెని వెంకన్న, బీఆర్​ఎస్​ లీడర్లు తదితరులున్నారు.