రైతులపై బీజేపీ క్రూర దాడి : మమత

రైతులపై బీజేపీ క్రూర దాడి : మమత

కోల్‌‌కతా: హర్యానాలో నిరసన తెలుపుతున్న రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. దీనిని రైతులపై బీజేపీ చేసిన క్రూరమైన దాడిగా ఆమె అభివర్ణించారు. తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతున్న రైతులపై టియర్ గ్యాస్ షెల్స్‌‌తో దాడి చేస్తే.. మన దేశం ఎలా పురోగమిస్తుందని ఆమె ప్రశ్నించారు. రైతులపై బీజేపీ చేసిన ఈ క్రూరమైన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మమత మంగళవారం ఎక్స్‌‌లో పోస్ట్‌‌ చేశారు. రైతుల నిరసనను అణచివేసే బదులు.. బీజేపీ నేతలు పెంచుకున్న ఇగోలను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని మమత సూచించారు.