మమతా జీ ఎందుకంత భయం.. పవర్ లోకి వస్తం

మమతా జీ ఎందుకంత భయం.. పవర్ లోకి వస్తం

బేజేపీని చూసి మమతా బెనర్జీ అంతలా ఎందుకు భయపడుతున్నారన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఎన్ని ప్రయత్నాలు చేసినా… వచ్చే ఎన్నికల్లో తమను అధికారంలోకి రాకుండా ఆపలేరన్నారు. పశ్చిమ బెంగాల్ పర్యటిస్తున్న ఆయన బర్దమాన్ లోని స్థానిక ఆలయంలో పూజలు చేశారు. ఆతర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కృషి చేస్తోందన్నారు నడ్డా. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయడంలో భాగంగానే.. కొత్త చట్టాలు తెచ్చామన్నారు. కొత్త చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. బెంగాల్ రైతుల రక్షణ కోసం ఇవాళ్టి నుంచి కృషక్ సురక్ష అభియాన్ ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సభ తర్వాత ఓ రైతు ఇంటికి వెళ్లిన నడ్డా.. అక్కడే భోజనం చేశారు. ఆవులకు మేత వేశారు.

ఎన్నికలప్పుడే రాజకీయం.. తర్వాత కలవాలి